ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధుల సమావేశం

68பார்த்தது
ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధుల సమావేశం
చందూర్ మండల కేంద్రంలో గురువారం ఎంపీడీవో నీలావతి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో సవరణలో అభ్యంతరాలు ఉన్నచో ఈ నెల 21 తారీకు వరకు పంచాయతీ కార్యదర్శులకు సమర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నీలావతి, ఎంపీ ఓ మధురిమ, మండల బిజెపి అధ్యక్షుడు మాడిశెట్టి విట్టల్, సొసైటీ మాజీ చైర్మన్ మాధవరెడ్డి, పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி