మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కౌన్సిలర్ రాధాకృష్ణను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో ఎంసిపిఐయు నాయకులు కౌన్సిలర్ రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. కౌన్సిలర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.