భైంసా పట్టణంలోని రాజీవ్ నగర్ ఏరియాల్లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ తమ ఓటును బిజెపి అభ్యర్థులకు వేసి గెలిపించాలని ఆదివారం కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణం ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ బండారి దిలీప్, నాయకులు వెంకటేశ్, గణేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.