ప్రాజెక్టులో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం ఆచూకీ లభ్యం

77பார்த்தது
భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులో గురువారం లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం ఆచూకీ తెలిసినట్లు పట్టణ ఎస్ఐ సుదర్శన్ తెలిపారు. కుబీర్ మండలం హల్తాకు చెందిన బత్తిని సాయినాథ్ (33)మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో కుటుంబీకులతో తరచూ గొడవ పడేవాడు. గొడవపడిన ఆయన ఇంటి నుంచి వెళ్లి ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி