ఖానాపూర్: ఘనంగా దుర్గాదేవి నిమజ్జనం

63பார்த்தது
ఖానాపూర్ పట్టణంలోని వివిధ కాలనీలలో దుర్గామాత అమ్మవారి విగ్రహాల శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని వివిధ కాలనీలలో నిర్వాహకులు దుర్గామాత అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి అమ్మవారి విగ్రహాలను అలంకరించిన వాహనాలలో ఉంచి ప్రధాన వీధులలో ఊరేగించారు. విగ్రహాలను సమీప గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.

தொடர்புடைய செய்தி