కోర్టుకు హాజరుకాని నవనీత్ కౌర్

61பார்த்தது
కోర్టుకు హాజరుకాని నవనీత్ కౌర్
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం ముందు 2022లో హనుమాన్ చాలీసా పఠించడంపై జరిగిన వివాదంలో మాజీ ఎంపీ నవనీత్ రాణాపై కేసు నమోదైన విషయం తెలిసిందే. సెక్షన్ 353 కింద ఆమెపై అప్పట్లో కేసు నమోదైంది. అయితే బుధవారం కోర్టు విచారణకు ఆమె హాజరు కాలేదు. అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో నిందితుడైన ఆమె భర్త, MLA రవి రాణా కోర్టుకు హాజరయ్యారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி