చండూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి శనివారం తమ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో నిలిచిపోయిన 400మీటర్ల రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి కారణాలు పరిష్కరించి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న 400 మీటర్ల రోడ్డు వెడల్పుకు సెంట్రల్ లైన్ ఫిక్స్ చేసి మార్కింగ్ చేయాలని ఆర్అండ్బి అధికారులకు తెలిపారు.