గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: మంత్రి కోమటిరెడ్డి

75பார்த்தது
గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: మంత్రి కోమటిరెడ్డి
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి సోమవారం పిలుపునిచ్చారు. మతం కన్నా మానవత్వం ముఖ్యమని ఆయన అన్నారు. నల్గొండ జిల్లా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, గడచిన 30 సంవత్సరాలలో జిల్లాలో ఎలాంటి చిన్న సంఘటనలు సైతం చోటు చేసుకోలేదని తెలిపారు. గతంలో లాగే ఈ సంవత్సరం సైతం వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி