రైతుల పాలిట దైవం మోడీ: ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి

11841பார்த்தது
రైతుల పాలిట దైవం మోడీ: ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి
ఒక్కరోజు సెలవు లేకుండా ప్రధాని మోదీ దేశానికి సేవలందిస్తున్నారని, బీజేపీ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ అని, మూడో సారి మోదీ ప్రధానిని చేసేందుకు అంతా పనిచేయాలని బీజేపీ లోక్ సభ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో సోమవారం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'రైతు సమ్మేళనం'లో ఆయన మాట్లాడారు. ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి రూ. 6వేలు సాయం చేయటంతో పాటుగా రూ.18వేలు ఎరువులకు సబ్బిడీ రూపంలో బీజేపీ ప్రభుత్వం అందించిందన్నారు. నీటి కోసం రైతులు అల్లాడుతున్నా జిల్లాలోని మంత్రులు సాగర్ నీరు ఇప్పించలేకపోయారని, రైతులు ఎకరానికి రూ. 25వేలు నష్టపోతే కనీస పరిహారం అందించలేదన్నారు.

தொடர்புடைய செய்தி