మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం (వీడియో)

85பார்த்தது
TG: నిర్మల్ జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లో కోతి కళేబరం కలకలం రేపింది. నీరు వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి గ్రామస్థులు ట్యాంక్ పైకి వెళ్లి చూశారు. ఈ మేరకు ట్యాంకులో కోతి కళేబరాన్ని చూసి షాకయ్యారు. గత వారం రోజులుగా ఈ నీటినే అధికారులు సరఫరా చేసినట్లు సమాచారం. దీంతో కలుషిత నీటిని సరఫరా చేశారని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி