ఏపీలోని తిరుపతి లోక్సభ నియోజకవర్గం ఫలితం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గురుమూర్తి గెలిచారు. అయితే తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో ఎమ్మెల్యేలుగా టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు గెలిచారు. ఈ ఫలితం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.