ఆస్పత్రి ముందు నర్సాపూర్ వాసుల ఆందోళన

73பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ కు చెందిన బాధితులు సోమవారం హైదరాబాద్ లోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. నర్సాపూర్కు చెందిన సంఘసాని యాదగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజులుగా ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో వారి నిర్లక్ష్యం మూలంగా యాదగిరి మృతి చెందాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி