బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సర్దన ప్రభుత్వ ఉద్యోగులు

81பார்த்தது
బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సర్దన ప్రభుత్వ ఉద్యోగులు
హవేలీ ఘణపూర్ మండలంలోని సర్దన గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి (వర్ష) (15) గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. గత ఆదివారం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఒక ప్రయివేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న సర్దన గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు, ఆ కుటుంబానికి తమ వంతుగా 15000 రూపాయలు ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

தொடர்புடைய செய்தி