గణేష్ మండప సభ్యులకు అభినందనలు తెలిపిన మాజీ మంత్రి

59பார்த்தது
మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు గణనాథులను రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజులు భక్తిశ్రద్ధలతో దైవ అనుగ్రహంతో నిష్టగా పూజలు నిర్వహించిన మండప సభ్యులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி