వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ బన్సీలాల్ సోమవారం హెచ్చరించారు. మంచిర్యాల పట్టణంలో నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్రను గణేష్ నిర్వహణ కమిటీ సభ్యులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన, గొడవలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక రౌడీషీట్, పిడి యాక్ట్ కేసు నమోదు చేస్తామన్నారు.