రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

73பார்த்தது
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడిఈ వేణుగోపాల్, ఏఈ సంధ్యారాణి తెలిపారు. సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఎల్ఐసి కాలనీ, ఎన్టీఆర్ నగర్, రెడ్డి కాలనీ, కాలేజీ రోడ్డు, మార్కెట్ ఏరియా, తదితర కాలనీలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி