తెలంగాణ మాల మహానాడు నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా అయిత పరమేష్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లపు శంకర్ నియమించి ఆయనకు నియామక పత్రం అందజేశారు. పరమేష్ మాట్లాడుతూ పట్టణ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్, రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జిల్లా అధ్యక్షుడు గజల్ లక్ష్మణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మాల మహానాడు ను మరింత బలోపేతం చేస్తామన్నారు.