మంచిర్యాల: కాకా వెంకట స్వామికి ఘన నివాళి

68பார்த்தது
మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం కేంద్ర మాజీ మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎంపీగా, కేంద్రమంత్రిగా కాకా అందించిన సేవలను కొనియాడారు.

தொடர்புடைய செய்தி