ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

56பார்த்தது
ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలు, పించను, పరిహారం, రుణమాఫీ, విద్యుత్, తదితర సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరిస్తున్నామన్నారు. ఆయా శాఖలకు చెందిన ఆర్జీలను పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచిస్తున్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி