సింగరేణి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం బొగ్గు గనులు, విభాగాల వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరు కావాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రకటించిన విధంగా రూ. 1550 కోట్లు కార్మికుల వాటాగా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సింగరేణి కార్మికుల పట్ల కపట ప్రేమ ఉందని రుజువైందని స్పష్టం చేశారు.