సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు వేతన పెంపుదల లేక అల్లాడిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం కానుకల పేరుతో సంస్థ సొమ్ము దుబారా చేస్తోందని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సింగరేణికి రావాల్సిన వేల కోట్ల బకాయిలు చెల్లించనందున కార్మిక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.