సింగరేణిలో వైద్యానికి డబ్బులు వసూలు చేయడం దుర్మార్గం

58பார்த்தது
సింగరేణిలో పనిచేస్తున్న, పదవీ విరమణ పొందిన కార్మికులకు అందించిన వైద్యానికి యాజమాన్యం డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమని ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు తోకల రమేష్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సింగరేణి కంపెనీ పురోగతికి అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల పట్ల యాజమాన్యం మానవతా విలువలకు విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం అన్నారు. దీనిపై గుర్తింపు సంఘం యాజమాన్యాన్ని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி