సింగరేణి సంస్థలు చెమటోడ్చి కష్టపడుతున్న కార్మికుల ఆదాయపన్ను రద్దుకు తమ సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో శనివారం ఆయన మాట్లాడుతూ కోల్ ఇండియాలో ఆదాయ పన్ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు తమ సంఘం పోరాడుతుందని పేర్కొన్నారు.