శాంతిఖని గని పై నల్ల బ్యాడ్జీలతో నిరసన

54பார்த்தது
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో సోమవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పిలుపుమేరకు కార్మిక సంఘం నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అనంతరం గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు వినతిపత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி