పెద్దనపల్లి బస్తీలో బాలింత మృత్యువాత

76பார்த்தது
పెద్దనపల్లి బస్తీలో బాలింత మృత్యువాత
బెల్లంపల్లి పట్టణంలోని పెద్దనపల్లి బస్తికి చెందిన మూడేడ్ల కవిత (24) బాలింత మృతి చెందింది. ఈనెల 5న పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి ఆడపిల్లలకు జన్మనిచ్చింది. సాయంత్రం అస్వస్థతకు గురికాగా మంచిర్యాలకి తరలిస్తుండగా మృతి చెందిందని తెలిపారు. అనారోగ్య కారణాలతో కవిత మృతి చెందిందని భావిస్తుండగా మృతురాలి సోదరి మాత్రం మృతి పై అనుమానం వ్యక్తం చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி