వానరానికి అంత్యక్రియలు నిర్వహించిన భజరంగ్ దళ్

81பார்த்தது
వానరానికి అంత్యక్రియలు నిర్వహించిన భజరంగ్ దళ్
ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు తగిలి మృతి చెందిన ఓ వానరానికి బజరంగ్ దళ్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన బెల్లంపల్లిలో గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని పాత జిఎం కార్యాలయం చౌరస్తా వద్ద రోడ్డుపైకి వచ్చిన వానరాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న బజరంగ్ దళ్ సభ్యులు వానరానికి స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు.

தொடர்புடைய செய்தி