సీతారాం ఏచూరి మృతిపట్ల మాజీ ఎంపీ రావుల దిగ్భ్రాంతి

66பார்த்தது
సీతారాం ఏచూరి మృతిపట్ల మాజీ ఎంపీ రావుల దిగ్భ్రాంతి
కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, సీపీఐ(ఎం) జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపట్ల బిఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గురువారం సంతాపం ప్రకటించారు. ఈ మేరకు రావుల ప్రకటన విడుదల చేశారు. సీతారం ఏచూరి మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. సిపిఎం, దేశానికి ఆయన మరణం తీరనిలోటు అన్నారు. రాజ్యసభలో ఏచూరికి తాను సహచర ఎంపీగా కొనసాగామని గుర్తుచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

தொடர்புடைய செய்தி