వాహనదారులు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఏఎస్సై ఆంజనేయులు అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలో వాహనాల తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, ఆర్సి, ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్ పత్రాలను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న చలాన్లను తనిఖీ చేశారు. వాహనదారులు పెండింగ్లో ఉన్న జరిమానాలు చెల్లించాలని చెప్పారు. డ్రైవింగ్ చేసే సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు.