బడిబాట పేరుతో గొప్పలు... ప్రభుత్వ పాఠశాలలకు అరకొర నిధులు

61பார்த்தது
బడిబాట పేరుతో గొప్పలు... ప్రభుత్వ పాఠశాలలకు అరకొర నిధులు
బడిబాట పేరుతో పాఠశాలల్లో రూపురేఖలను మార్చేస్తున్నామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ప్రాంతాలలో నిధుల కొరతతో నిలిచిపోయాయి. కొన్ని పాఠశాల భవనాలు ఎప్పుడు కులుతాయో కూడా తెలియని విధంగా తయారయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మానవపాడు మండలలోని ఉన్నత పాఠశాల పరిస్థితి కూడా అదే విధంగా మారింది. ఈ పాఠశాలలో సుమారు 550మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాల భవనాన్ని పదేళ్ల క్రితం నిర్మించారు. పట్టుమని పదేళ్లు గడవక ముందే శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడి విద్యార్థులపై పడిన సందర్భాలు లేకపోలేదు.

தொடர்புடைய செய்தி