విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ విజయేంద్ర బోయి

57பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోని మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీని గమనించిన కలెక్టర్ తక్షణమే అరికట్టాలని ఆదేశించారు. అనంతరం వంట గదులను కలెక్టర్ పరిశీలించి పాఠశాల విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி