ముంపు గ్రామాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

67பார்த்தது
ముంపు గ్రామాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన గట్టు మండలం చిన్నోనిపల్లి, మల్దకల్ మండలం నాగర్ దొడ్డి గ్రామాలను బుధవారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ పరిశీలించారు. నిర్వాసితులైన 250 మందికి ఒక్కొక్కరికి రూ. 16, 500 చొప్పున నష్టపరిహారం త్వరలో అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ రెండు గ్రామాల్లో ఆయన పర్యటించి బాధితులను పరామర్శించారు.

தொடர்புடைய செய்தி