ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు దేవరకద్ర నియోజకవర్గంలోని పొన్నకల్ గ్రామ శివారులో ఇసుక రీచ్ లను గుర్తించామని ఇక్కడి నుంచే ఇసుకను సరఫరా చేయాల్సిందిగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులు ఆదేశించారు. శుక్రవారం ఇసుక రీచ్ ను పరిశీలించిన కలెక్టర్ ఇసుక వాహనాలను లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. అవకతవలకు ఎక్కడా తావు లేకుండా ఇసుకను అందించాలన్నారు.