తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) గడువును పొడిగిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామని పలువురి ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా, మార్చి 31 వరకు ఫీజు రూపంలో దాదాపు రూ.1200 కోట్లు వసూలు అయినట్లు అధికారులు వెల్లడించారు.