LIVE Video: కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య

591பார்த்தது
రాజస్థాన్ లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన బగీషా తివారీ(18) అనే యువతి తన తల్లి, సోదరుడితో కలిసి జవహర్‌ నగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటోంది. అక్కడే కోచింగ్ తీసుకుంటూ నీట్ కు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో నీట్ యూజీ ప్రవేశ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఏడాదిలో కోటాలో ఇది 11వ ఆత్మహత్య కావడం గమనార్హం. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி