రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

79பார்த்தது
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మణుగూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మంగళవారం పాయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వార్డులను పరిశీలిస్తూ అక్కడున్న రోగులకు అందుతున్న వైద్యసేవలను తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలను తాను సమకూరుస్తానని, రోగులకు మాత్రం అత్యంత మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులతో పాటు వైద్య సిబ్బందిపై ఉందన్నారు.

தொடர்புடைய செய்தி