గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం

56பார்த்தது
గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం
జూలూరుపాడు మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచే వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఆదివారం కాకర్ల-అనంతారం గ్రామాల మధ్య ఎర్రవాగుకు వరద ప్రవాహం పెరగడంతో పంచాయతీ కార్యదర్శి నాని బాబు రోడ్డు బ్లాక్ చేయించారు. ప్రజలు రోడ్డు దాటే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ముందస్తు చర్యలు చేపట్టామని పంచాయతీ కార్యదర్శి చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

தொடர்புடைய செய்தி