దుమ్ముగూడెంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ మామిడి అశోక్ కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని దబ్బనూతల, కమలాపురం, కొత్తూరు గ్రామాలలో గ్రామ సభ నిర్వహించి ఆయా గ్రామాలలోని భూ సమస్యలపై గిరిజన రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం రైతుల నుండి 21 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.