పాఠశాలను పరిశీలించిన అడిషనల్, సబ్ కలెక్టర్లు

74பார்த்தது
పాఠశాలను పరిశీలించిన అడిషనల్, సబ్ కలెక్టర్లు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సంఘంబస్తీలో ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాల శిథిలావస్థకు చేరింది. రెండు రోజుల క్రితం తరగతి గది గోడ కూలింది. దీంతో మంగళవారం అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలను తాత్కాలికంగా వేరే భవనానికి మారుస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி