డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆసిఫాబాద్లోని అంబేడ్కర్ విగ్రహాన్ని ఎంపీ నగేశ్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుతో కలసి శుద్ధి చేసి నివాళులు అర్పించారు. భావితరాలకు అంబేడ్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేయడంతో పాటు, దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు.