లారీ-కోళ్ల వ్యాన్ ఢీ.. వ్యక్తి మృతి

63பார்த்தது
లారీ-కోళ్ల వ్యాన్ ఢీ.. వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన వైరాలో సోమవారం చోటుచేసుకుంది. ఖమ్మం నుండి తల్లాడకు వెళుతున్న కోళ్ల వ్యాన్ వైరా పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోళ్ల వ్యాన్ క్యాబిన్లో ఉన్న క్లీనర్ గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఎస్ఐ భాగ్యరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி