నిమజ్జనం ఏర్పాట్లపై తహశీల్దార్ సమీక్ష

57பார்த்தது
నిమజ్జనం ఏర్పాట్లపై తహశీల్దార్ సమీక్ష
గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కే. యోగేశ్వరరావు కోరారు. సోమవారం సత్తుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వరదలపై శాఖల పరంగా తీసుకోవల్సిన చర్యలు, గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు, బేతుపల్లి, తామర చెరువుల వద్ద విద్యుత్, క్రేన్, గజ ఈతగాళ్లు మొదలగు ఏర్పాట్ల గురించి చర్చించారు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఎంపిడివో నాగేశ్వరరావు ఉన్నారు.

தொடர்புடைய செய்தி