రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు మూడు రోజుల్లో నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ లో పర్యటించిన ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నెలలు గడిచినా పంట నష్ట పరిహారం ఇవ్వలేదని.. రుణమాఫీ చేయకుండా మోసం చేశారని విమర్శించారు.