మున్నేరు వరద ప్రభావంతో ముదిగొండ మండలంలో పొలాల్లోని విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పాటు, ట్రాన్స్ ఫార్మర్లు నీట మునిగాయి. పండ్రేగుపల్లిలో 40 పైగా విద్యుత్ స్తంభాలు విరగగా, 8 ట్రాన్స్ ఫార్మర్లు మునిగినట్టు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. వాటి స్థానంలో కొత్త స్తంభాలు వేయనున్నట్లు ఏఈ తెలిపారు.