కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఎం కార్యకర్తలను కోరారు. మంగళవారం ఖమ్మంలో సీపీఎం పార్టీ నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం కార్పొరేట్ కు కట్టబెడుతోందని, బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.