మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యం

77பார்த்தது
మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యం
మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యమని షీ టీం ఇన్‌చార్జి మల్లన్న తెలిపారు. ఆదివారం పాలకుర్తి మండలం కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, డయల్‌ 100, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ, మద్యపాన నిషేధం తదితర వాటిపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో షీ టీం సిబ్బంది స్నేహలత, సురేష్, ఎస్ వో స్వరూప టీచర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி