తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్గా ప్రమాణస్వీకారం చేసిన ప్రీతంను శుక్రవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంపల్లి సతీష్ కలిసి అభినందనలు తెలిపారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్, తిమ్మాపూర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రెడ్డి గాని రాజు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్ తదితరులు పాల్గోన్నారు.