కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆరెపల్లిలో బుధవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆరె కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి లంక సదయ్య, మాజీ సర్పంచ్ దేవేందర్రావు, మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య పాల్గొన్నారు.