పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని భారీ వర్షాల కారణంగా ఈరోజు రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.