కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా సత్తు మల్లేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన మల్లేశ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా పేరుపొందారు. సత్తు నియామకం పట్ల పలువురు హర్ష వ్యక్తం చేశారు.