విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని వినతి పత్రం

54பார்த்தது
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని వినతి పత్రం
మాల్యాల మండల కేంద్రంలోని తూర్పువాడలో ట్రాన్స్ ఫార్మర్ అధికలోడు ప్రభావంవల్ల ఇండ్లలోని మోటార్లు, టీవీలు, ఫ్రిడ్జ్ లు తరచూ కాలిపోతుండటంతో బుధవారం విద్యుత్ శాఖ ఏఈని కాలనీ వాసులు కలిసి వినతి పత్రం అందజేశారు. కాలనీవాసులు మాట్లాడుతూ. రోజులో కనీసం ఐదుసార్లు కరెంట్ పోతుందని, దానివల్ల ఇబ్బంది, నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ విషయమై ఏఈ సానుకూలంగా స్పందించి త్వరగా సమస్య పరిష్కారిస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி